దాడులు నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తెరవండి: ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి

  • అరబ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని విజ్ఞప్తి
  • హర్మూజ్ జలసంధిని తెరవాలన్న 22 దేశాలు
  • అదే సమయంలో వాణిజ్య నౌకలు, మౌలిక సదుపాయాలపై దాడులపై ఆగ్రహం
అరబ్ దేశాలపై దాడులను నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూఏఈ, బహ్రెయిన్ సహా 22 దేశాలు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 22వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. దాడులు, ప్రతిదాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ అరబ్ దేశాల్లోని అమెరికా సదుపాయాలపై వైమానిక, డ్రోన్ దాడులు చేస్తోంది.

ఈ క్రమంలో 22 దేశాలు కలిసి ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు వాణిజ్య నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ దేశాలు సంయుక్త ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.

డిగో గార్సియాపై దాడి.. తీవ్రంగా స్పందించిన బ్రిటన్

హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యూఎస్-యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులు దుస్సాహసంగా అభివర్ణించింది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత వంటివి తమ ప్రయోజనాలకు, తమ మిత్రదేశాలకు ముప్పుగా బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.

Iran
Hormuz Strait
UK
France
Japan
US Israel conflict
Middle East attacks
Diego Garcia
Arab countries

More Telugu News